వైకాపా బంద్ను జయప్రదం చేయాలి
Published Monday, 1 August 2016రాయచోటి, జూలై 31: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఆగస్టు 2న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన తన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రానప్పుడు రాయలసీమకైనా ప్రత్యేక హోదా కావాలనే నినాదాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్దామన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, బీజేపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా చేపట్టే ఈ ప్రజాబంద్ను ప్రజలు ఇబ్బందికరంగా భావించకుండా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యజమానులు, వాణిజ్య విభాగాలు, ఆర్టీసీ, అన్ని వర్గాల ప్రజలు సహకరించి మద్దతు ప్రకటించాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తమతో కలిసివచ్చి బంద్లో పాల్గొని విజయవంతం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుదామని శ్రీకాంత్రెడ్డి కోరారు.