S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

స్వామి పాదాల సాక్షిగా హామీలిచ్చారు... మోసం చేశారు

తిరుపతి, జూలై 31: ఎన్నికల ముందు వెంకన్న పాదాల సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేశారని వైసిపి రాష్ట్ర కార్యదర్శి కరుణాకర్‌రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు దొంగనాటకాలు ఆడుతున్నాయని, ఈనెల 2న వైసిపి ఇచ్చిన రాష్టబ్రంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆదివారం తన నివాసంలో ఆయన నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఎలా మోసం చేశారో తెలియజేసే విధంగా కార్యకర్తలు,నాయకులు కార్యోన్ముఖులు కావాలన్నారు. ఈనేపథ్యంలో చేపడుతున్న బంద్ శాంతియుతంగా విజయవంతం చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసిపి నగర కన్వీనర్ పాలగిరి ప్రతాప్‌రెడ్డి, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, మణి, ఎస్‌కె బాబు, ముద్రనారాయణ, రాజేంద్ర పాల్గొన్నారు.