S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దస్తగిరిస్వామి పీఠాధిపతికి ఎమ్మెల్యే సత్కారం

బనగానపల్లె, జూలై 31:పట్టణంలోని బేతంచర్ల రోడ్డులో వెలసిన శ్రీదస్తగిరి స్వామి దర్గా 5వ పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించనున్న శ్రీ సయ్యద్ అబ్దుల్ హుస్సేన్‌ను ఎమ్మెల్యే బిసి జనార్ధనరెడ్డి అభినందించారు. ఎమ్మెల్యే బిసి ఆదివారం ఉదయం దస్తగిరి స్వామి దర్గా వద్దకు వెళ్లి శ్రీ అబ్దుల్ హుస్సేన్‌ను శాలువా, పూలమాలలతో సత్కరించి, మిఠాయిలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దస్తగిరిస్వామి పీఠాధిపతిగా వున్న అబ్దుల్‌హుస్సేన్ కుటుంబీకులు బనగానపల్లె ముస్లింలకు ఎనలేని సేవలు అందిస్తున్నారని కొనియాడారు. అందుకే దస్తగిరిస్వామి దర్గా పీఠాధిపతులపై ముస్లింలు అభిమానం పెంచుకున్నారన్నారు. 4వ పీఠాధిపతిగా వున్న జెండావాలే సాహెబ్ అనారోగ్యంతో సుమారు నెలన్నర క్రితం అస్తమయం చెందడంతో వారి స్థానంలో వారి కుమారులు సయ్యద్ అబ్దుల్ హుస్సేన్ 5వ పీఠాధిపతిగా సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో ఎమ్మెల్యే బిసి ఆదివారం పీఠాధిపతిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు