ఒంగోలు నుండి గొట్లకట్టు వరకు 71 కిలోమీటర్ల డబుల్ రోడ్డు
Published Monday, 1 August 2016ఒంగోలు,జూలై 31:్భరతమాల స్కీం కింద ఒంగోలు నుండి గొట్లకట్టు వరకు 71కిలోమీటర్ల మేర డబుల్ రోడ్డుమంజూరైందని దానికి సంబంధించిన సమగ్రనివేదికను తయారుచేయాలని ఒంగోలు పార్లమెంటు సభ్యుడు వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఆదివారం నేషనల్ హైవే ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటేశ్వర్లు ఎంపిని తన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఎంపి సుబ్బారెడ్డి మాట్లాడుతూ కిలోమీటరుకు 10కోట్లరూపాయల చొప్పున ఖర్చు అవుతుందన్నారు. నాణ్యతాప్రమాణాలతో ఈ రోడ్డును నిర్మించేవిధంగా నివేదికను తయారు చేయాలన్నారు.ప్రమాదాలు జరగకుండా సంతనూతలపాడునుండి ఒంగోలు వరకు బైపాస్రోడ్డును వేయాలని ఆయన పిడికి సూచించారు.