సేవలే గుర్తింపునిస్తాయి
Published Monday, 1 August 2016శ్రీకాకుళం(టౌన్), జూలై 31: ప్రభుత్వ ఉద్యోగికి తన సర్వీసులో ప్రజలకు అందించిన మంచి సేవలే గుర్తింపును ఇస్తాయని జిల్లా పోలీసు సూపరింటెండెంటు జె.బ్రహ్మారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పదవీ విరమణ చేసిన సిసియస్ సబ్ ఇన్స్పెక్టర్ బి.వాసుదేవరావు, మహిళా పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ పి.మేరీలను ఆయన ఈ సందర్భంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పదవీ విరమణ ప్రభుత్వ ఉద్యోగికి తప్పనిసరి అని, అంతమాత్రాన తాను ఏదో కోల్పోయినట్లు భావించరాదన్నారు. పదవీ విరమణ పొందిన తరువాత తన శేష జీవితం మంచి ఆరోగ్యంతో సాగించడం అదృష్టంగా బావించాలన్నారు. తన శాఖలో పదవీవిరమణ పొందిన ఉద్యోగికి ఎపుడు అవసరం వచ్చినా తాను ఆదుకోవడానికి ముందుంటానని పేర్కొన్నారు. అనంతరం వారి కుటుంబ పరిస్థితిలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఓయస్డి కె.తిరుమల రావు, డిఎస్పీ కె.్భర్గవరావు నాయుడు, జిల్లా పోలీసు కార్యాలయం సూపరింటెండెంటు పి.రాజేశ్వరరావు, సిబ్బంది పి.కోటేశ్వరరావు, ఆర్ఐ కోటిబాబు పాల్గొన్నారు.