S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రత్యేక హోదా కోసం రేపు రాష్ట్ర బంద్

మాడుగుల(రూరల్), జూలై 31: ఈ నెల 2న మంగళవారం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కోరుతూ ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లును ఆమోదించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం కావడం పట్ల రాష్ట్ర బంద్‌ను నిర్వహిస్తున్నామని వైసిపి రాష్ట్ర పరిశీలకుడు, మాజీ మంత్రి బొత్స సత్యన్నారాయణ తెలిపారు. ఆదివారం మండలంలోని కెజె పురం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ నిర్వహించిన కార్యక్రమానికి విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ఏపికి ప్రత్యేక హోదాను సాధించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగాను, ప్రత్యేక హోదాను ఇవ్వాలన్న డిమాండ్‌తోను ఈ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చామన్నారు. అలాగే విజయవాడలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ప్రభుత్వం తొలగించడాన్ని తాము తీవ్రంగా నిరసిస్తున్నామన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన తండ్రిపేర ప్రారంభించి లక్షి గణపతి వెంచర్ పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లావైసీపీ అద్యక్షుడు అమర్‌నాద్, మాజీ మంత్రి కొండ్రు మురళీ, తిప్పల నాగిరెడ్డి, ఎమ్మెల్యే ముత్యాలనాయుడు పాల్గొన్నారు.