S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పోరు పోరే.. పొత్తు పొత్తే!

హైదరాబాద్, జూలై 31: బిజెపిపై తెదేపా ప్రారంభించిన మాటల యుద్ధం చేతల వరకూ వెళ్లడం అనుమానంగానే ఉంది. రెండురోజుల నుంచి బాబు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో జరుపుతున్న చర్చలను బట్టి, ఎన్నికల ముందు వరకూ కేంద్రం నుంచి బయటకు రావడం అనుమానమేనన్న విషయం స్పష్టమవుతోంది. రాష్ట్రానికి బిజెపి అన్యాయం చేస్తోందన్న ఆరోపణలు ఇదే విధంగా కొనసాగిస్తూనే, మరోవైపు కేంద్రంతో కలసి ఉండాలన్న ద్విముఖ వ్యూహం అనుసరించాలని బాబు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. పార్టీవిధానం మేరకు కేంద్రంతో సీరియస్‌గా పోరాడితే అసలుకే ఎసరు వస్తుందన్న భయం మరోవైపు ఎంపీల్లోనూ కనిపిస్తోంది. చాలామంది ఎంపీలకు ఇతర రాష్ట్రాలతోపాటు, ఇతర దేశాల్లోనూ ఎక్కువ వ్యాపారాలున్నాయి. వారిలో పలువురు ఇన్‌ఫ్రా, పవర్ ప్రాజెక్టు వ్యాపారాలు చేస్తున్నారు. ఇవన్నీ కేంద్రానికి సంబంధించినవే. తెదేపా ఎంపీలలో ముగ్గురు, నలుగురు మినహాయిస్తే మిగిలినవారంతా వ్యాపారవేత్తలే కావడం గమనార్హం.
కేజ్రీవాల్ అంతటి నిజాయితీపరుడినే నీళ్లు తాగిస్తున్న మోదీకి, తమపై దృష్టి సారించడం పెద్ద కష్టం కాదన్న భయాందోళన వ్యాపారాలు చేస్తున్న ఎంపీల్లో కనిపిస్తోంది. దానికితోడు కేంద్రం కేసీఆర్‌తో సన్నిహితంగా వ్యవహరిస్తుండటం, జగన్ అవకాశం కోసం ఎదురుచూస్తుండటం, కొన్ని కీలకమైన కేసుల దృష్ట్యా ఇప్పుడే కేంద్రం నుంచి బయటకొస్తే, జయలలిత, కేజ్రీవాల్ మాదిరిగా అధికారం ఉన్నా ఇబ్బందులు పడతామన్న ముందుజాగ్రత్తతో తెదేపా నాయకత్వం వ్యవహరిస్తోంది. కాగా, ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాల వరకూ వేచిచూడాలన్న ధోరణి కూడా బాబులో ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈలోగా, తమ పార్టీ హోదా గురించి ఏమీ చేయడం లేదన్న విమర్శలు రాకుండా, లోక్‌సభతో పాటు అందుబాటులో ఉన్న అన్ని వేదికలపైనా హోదాపై పోరాడాలని ఆదివారం నాటి ఎంపిల సమావేశంలో నిర్ణయించారు.
అందులో భాగంగా, బిజెపితో తాడో పేడో తేల్చుకునేందుకు బాబు సిద్ధంగా ఉన్నారని, మోదీతో భేటీ అయిన తర్వాత అందులో ఇచ్చిన వినతిపత్రాల్లోని అంశాలను పరిష్కరించకపోతే, కేంద్రం నుంచి బయటకు వస్తారన్న ప్రచారాన్ని మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. కాగా ఆదివారం నిర్వహించిన మీడియా భేటీలో బిజెపిని విమర్శించిన బాబు, తాము మిత్రధర్మాన్ని పాటిస్తామని చెప్పడం బట్టి, ఇప్పట్లో తెదేపా కేంద్రం నుంచి బయటకొచ్చే అవకాశం లేదన్న విషయం స్పష్టమవుతోంది.