నర్సరీలోకి దూసుకెళ్లిన లారీ: ఇద్దరు మృతి
Published Monday, 1 August 2016హైదరాబాద్: అదుపుతప్పిన లారీ ఓ నర్సరీలోకి దూసుకువెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు మరణించిన ఘటన మదీనాగూడలో సోమవారం ఉదయం జరిగింది. కూకట్పల్లి నుంచి భెల్వైపు వెళ్తున్న లారీ రోడ్డుపై బీభత్సం సృష్టిస్తూ నర్సరీలోకి దూసుకువెళ్లింది. అక్కడ పనిలో ఉన్న తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు మరణించారు. లారీ డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.