ఆంధ్రాబ్యాంకులో చోరీకి విఫలయత్నం
Published Monday, 1 August 2016వరంగల్: సిసి కెమెరాలను ధ్వంసం చేసి ఆంధ్రాబ్యాంకు శాఖలో చోరీకి దొంగలు విఫలయత్నం చేశారు. ఈ ఘటన మండల కేంద్రమైన పురవిలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. దొంగలు బ్యాంకు తలుపులు బద్దలుకొట్టి సిసి కెమెరాలను ధ్వంసం చేశారు. నగదు చోరీ చేయాలని యత్నించినా ఫలితం దక్కలేదు. సోమవారం ఉదయం బ్యాంకును తెరిచిన అధికారులు చోరీకి యత్నం జరిగిందని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.