అంత్య పుష్కరాల్లో భక్తుల కోలాహలం
Published Monday, 1 August 2016రాజమండ్రి: గోదావరి అంత్య పుష్కరాల సందర్భంగా సోమవారం రెండో రోజు పుణ్యస్నానాలు చేసేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. రాజమండ్రి, కొవ్వూరుతో పాటు పలు చోట్ల ఘాట్లలో భక్తులు భారీ సంఖ్యలో కనిపించారు. తెలంగాణలో భద్రాచలం, బాసర, మంచిర్యాల, గూడెం తదితర ప్రాంతాల్లో గోదావరి నదీ తీరాన భక్తులు పెద్దసంఖ్యలో చేరుకుని పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.