మాజీ సిఎంలకు భారీ భవనాలు వద్దు: సుప్రీం
Published Monday, 1 August 2016దిల్లీ: ప్రభుత్వానికి చెందిన ఖరీదైన భవంతుల్లో మాజీ ముఖ్యమంత్రులకు వసతి కల్పించనక్కర్లేదని సుప్రీం కోర్టు సోమవారం సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. దేశవ్యాప్తంగా చాలామంది మాజీ సిఎంలు ఇప్పటికీ వివిఐపిల మాదిరి విలాసవంతమైన భవనాల్లో ఏళ్లతరబడి తిష్టవేశారు. వీరికి వివిఐపిల మాదిరి భారీ భవనాలు కేటాయించనవసర లేదని కోర్టు తీర్పు చెప్పడంతో చాలా మంది సిఎంలకు స్థాన చలనం తప్పదేమో.