బాబ్లీ పర్యవేక్షక కమిటీలో ఏపీ కొనసాగింపు
Published Monday, 1 August 2016దిల్లీ: బాబ్లీ పర్యవేక్షక కమిటీలో ఆంధ్రప్రదేశ్ కొనసాగుతుందని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత బాబ్లీ ప్రాజెక్టు పట్ల ఆంధ్రప్రదేశ్కు ఎలాంటి ఆసక్తి లేదని తెలంగాణ తరపు న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించారు. మహారాష్ట్ర తరపున వాదించిన అంధ్యార్జున ఏపీని తొలగించాలని వాదనలు వినిపించారు. పర్యవేక్షక కమిటీలో ఏపీని కొనసాగించడం వల్ల భవిష్యత్తులో సమస్యలు తలెత్తుతాయన్నారు.
కమిటీ నుంచి తొలగిస్తే తమ రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం చూకూరుతుందని ఏపీ తరపున ఏకే గంగూలీ వాదనలు వినిపించారు.తెలంగాణ వాదనతో విభేదించిన ధర్మాసనం మహారాష్ట్ర నీటి వినియోగాన్ని తెలుగు రాష్ట్రాలు పరిశీలించవచ్చని ఆదేశాలు జారీచేసింది.