బాబు ఒత్తిడి లేకే ఎపిపై కేంద్రం చిన్నచూపు
Published Monday, 1 August 2016దిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబు ధైర్యంగా అడగనందునే ఎపిపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని, ప్రత్యేక హోదాపై టిడిపి ఎంపీలు నాటకాలాడుతున్నారని వైకాపా ఎంపి మేకపాటి రాజమోహన్రెడ్డి సోమవారం ఇక్కడ మీడియాతో అన్నారు. చంద్రబాబు వ్యక్తిగత లబ్ధి కోసం తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేయడం లేదన్నారు. ప్రత్యేక హోదా కోసం వైకాపా రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. యుపి ఎన్నికల్లో బిజెపి ఓడిపోతే ఎన్డిఎ నుంచి టిడిపి తప్పుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు. కాగా, ప్రత్యేక హోదా కోసం టిడిపి ఎంపీలు నేరుగా ప్రధానిపై ఒత్తిడి తేవాలని వైకాపా ఎంపీ వైవి సుబ్బారెడ్డి సూచించారు. 2న జరిగే రాష్టబ్రంద్కు అన్ని వర్గాల వారూ మద్దతు ఇవ్వాలని కోరారు.