ఎంసెట్-2 లీకేజీలో దోషులను శిక్షించాలి
Published Monday, 1 August 2016కరీంనగర్ : ఎంసెట్-2 పేపర్ లీకేజీలో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బిజెవైఎం కార్యకర్తలు సోమవారం ఇక్కడ పెద్దఎత్తున ఆందోళన చేశారు. పురపాలక సంఘాలకు సంబంధించి మంత్రి కెటిఆర్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సమావేశం జరుగుతున్న ప్రాంగణంలోకి ఆందోళనకారులు ప్రవేశించి నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ప్రవేశించి కొంతమంది ఆందోళనకారులను అరెస్టు చేశారు.