S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎపికి ప్యాకేజీపై కేంద్రం కసరత్తు..?

దిల్లీ: ఎపికి ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం ఎంపీలు దిల్లీలో ధర్నా ప్రారంభించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఎపికి ప్రత్యేక ప్యాకేజీ కోసం కసరత్తు చేయాల్సిందిగా వెంకయ్యకు మోదీ చెప్పినట్లు సమాచారం. సిఎం చంద్రబాబుతో మాట్లాడాల్సిందిగా కేంద్రమంత్రులు వెంకయ్య, అరుణ్ జైట్లీలకు ప్రధాని ఆదేశించారని తెలిసింది. ప్రత్యేక హోదాకు బదులు ఎపికి ఆమోదయోగ్యంగా ప్యాకేజీ ప్రకటించేందుకు మోదీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్యాకేజీకి తుదిరూపం వచ్చాక మోదీ స్వయంగా ఒక ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు.