ఏపీకి ఆర్థికసాయంపై మంత్రి ఇంద్రజిత్ ప్రకటన
Published Monday, 1 August 2016దిల్లీ: ఆంధ్రప్రదేశ్కు మార్చి 2016 వరకు రూ.6,403 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ సోమవారం రాజ్యసభలోతెలిపారు. రెవెన్యూ లోటు కింద రూ.2,803 కోట్లు, ఏడు వెనుకబడిన జిల్లాలకు రూ.700 కోట్లు, నూతన రాజధానికి రూ.2050 కోట్లు, పోలవరానికి రూ.850 కోట్లు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. తెదేపా ఎంపీ టీజీ వెంకటేశ్ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు.