రియో ఒలింపిక్స్కు నర్సింగ్ యాదవ్
Published Monday, 1 August 2016దిల్లీ: రియో ఒలింపిక్స్లో పాల్గొనేందుకు రెజ్లర్ నర్సింగ్ యాదవ్కు మార్గం సుగమమైంది. రెజ్లింగ్ 74 కిలోల విభాగంలో భారత్ తరఫున నర్సింగ్ యాదవ్ బరిలో దిగనున్నాడు. డోపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కు భారత డోపింగ్ నిరోధక సంస్థ(నాడా) క్లీన్చిట్ ఇచ్చింది. రియోకు సిద్ధమైన నర్సింగ్ డోపింగ్ పరీక్షలో దొరికిపోయాడు. దీంతో నర్సింగ్పై తాత్కాలికంగా సస్పెన్షన్ వేటు వేశారు.కుట్రపూరితంగా తనను ఇరికించారని నర్సింగ్ వాదించారు. పూర్తి విచారణ అనంతరం సోమవారం తుది తీర్పు వెలువరించిన నాడా నర్సింగ్కు క్లీన్చిట్ ఇచ్చింది.