పాతబస్తీలో అమ్మవారి వూరేగింపు ప్రారంభం
Published Monday, 1 August 2016హైదరాబాద్: పాతబస్తీలోని అక్కన్న మాదన్న ఆలయం వద్ద అమ్మవారి వూరేగింపు సోమవారం ప్రారంభమైంది. వూరేగింపును నగర పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి ప్రారంభించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.లాల్దర్వాజలోని సింహవాహిని మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమం ప్రారంభమైంది. అమ్మవారి భక్తురాలు అనురాధ పచ్చికుండపై నిల్చుని భవిష్యవాణిని విన్పించనున్నారు. ఘటాల వూరేగింపు శాలిబండ, చార్మినార్, గుల్జార్హౌస్, మదీనా మీదుగా నయాపూల్కు చేరుకుంటుంది. మూసీనదిలో ఘటాల నిమజ్జనంతో బోనాల ఉత్సవాలు ముగుస్తాయి.