చత్తీస్గఢ్లో మావోల ఘాతుకం
Published Tuesday, 2 August 2016చింతూరు, ఆగస్టు 1: చత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేరు, బీజాపూర్ జిల్లాల్లో పోలీసు ఇన్ఫార్మర్ల నెపంతో సోమవారం ఒక మహిళ సహా అయిదుగురిని మావోయిస్టులు హతమార్చారు. కాంకేరు జిల్లాలో నలుగురిని, బీజాపూర్ జిల్లాలో ఒకరిని మట్టుబెట్టారు. కాంకేరు జిల్లా కొయిలీబెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొందుల్మెడమట గ్రామానికి చెందిన కడియం రాజు, మరకం సోమ, మరో మహిళను ఆదివారం రాత్రి కిడ్నాప్ చేశారు. గీత్మెట అటవీప్రాంతంలో ప్రజాకోర్టు నిర్వహించి ముగ్గురినీ హతమార్చారు. అలాగే బడ్గం పోలీస్ స్టేషన్ పరిధిలో రామ అనే మరో వ్యక్తిని హతమార్చారు. బీజాపూర్ జిల్లా ఫర్సేఘర్ పరిధిలో చీరాపాల్-పాల్మయ రహదారి మధ్యలో సోమపల్లి గ్రామం వద్ద ఒక వ్యక్తిని హత్యచేశారు. ఈ హత్యలకు గురైనవారి పూర్తి వివరాలను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.