ఏపీని అన్ని విధాలా ఆదుకుంటాం
Published Tuesday, 2 August 2016న్యూఢిల్లీ, ఆగస్టు 1: విభజన హామీల అమలుకు ఎన్డీయే ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని బీజేపీ ఎంపీ హరిబాబు అన్నారు. సొమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, హోదా విషయంలో ఉన్న ఇబ్బందులను అధిగమించి ఏపీకి ఏం సహాయం చేయాలన్న దానిపై కేంద్రం కసరత్తు చేస్తోందన్నారు. ఏపీని ఆదుకోవాడానికి ఉన్న అన్ని ప్రత్యామ్నాయాలను కేంద్రం పరిశీలిస్తోందని అన్నారు. ఏపీని అన్ని విధాలుగా అందుకుంటుందని స్పష్టం చేశారు. విశాఖపట్నం పోర్టు ట్రస్టులలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను కేంద్ర కార్మిక ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయకు వివరించామని, సమస్యల పరిష్కరిష్కారానికి మంత్రి హామీ ఇచ్చారని చెప్పారు.