బలపడిన అల్పపీడనం కోస్తాకు వర్ష సూచన
Published Tuesday, 2 August 2016విశాఖపట్నం, ఆగస్టు 1: ఉత్తర బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం కూడా కొనసాగుతోంది. రానున్న 48 గంటల్లో ఇది మరింత బలపడనుందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సోమవారం రాత్రి తెలిపారు. నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా ఉండటంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇదే సమయంలో పశ్చిమ దిశగా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయి.