S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రత్యేక హోదాపై దొంగాట

భీమవరం, జూలై 30: స్థానిక ప్రకాశం చౌక్‌లో శనివారం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంకెం సీతారాం ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపట్టారు. పార్లమెంటు సాక్షిగా బిజెపి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం లేదని, ఈ ఆందోళనకు తెలుగు ప్రజల తరఫున యువజన కాంగ్రెస్ ఉద్యమిస్తుందని యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంకెం సీతారాం అన్నారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇచ్చిన పిలుపుమేరకు రాష్టవ్య్రాప్తంగా ఈ ఆందోళన చేశామన్నారు. తెలుగు ప్రజలను బిజెపి, టిడిపిలు మోసం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ లోక్‌సభలో ప్రవేశపెట్టిన ప్రత్యేక హోదా బిల్లుకు టిడిపి, బిజెపిలు మద్దతు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. లోక్‌సభలో ఎపి ఎంపీలు చేస్తున్న వ్యవహార శైలిని పరిశీలిస్తుంటే తెలుగు ప్రజలను మోసం చేసే విధంగా ఉందన్నారు. ఈ ఆందోళనలో యువజన కాంగ్రెస్ పార్టీ వివిధ నియోజకవర్గాల నాయకులు పెద్దిరెడ్డి సుబ్బారావు, వెంకట రత్నంనాయుడు, ఉప్పలపాటి ఫణీంద్రకుమార్, పిట్టా సురేష్, కొల్లాబత్తుల సురేష్, గౌతు గణపతి తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి అంత్య పుష్కరాలు
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, జూలై 30: పవిత్రమైన గోదావరి అంత్య పుష్కరాలు ఆదివారం నుంచి ప్రారంభమవుతున్నాయ. ఆగస్టు 11వరకు జరిగే అంత్య పుష్కరాలకు జిల్లాలోని అన్ని ప్రధాన ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. జిల్లాలో ముఖ్యంగా నరసాపురం, కొవ్వూరు, దొడ్డిపట్ల తదితర ప్రాంతాల్లో అంత్య పుష్కర స్నానాలు జరుగుతాయని భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా అధికార్లు తగుమాత్రపు ఏర్పాట్లుచేశారు. అంత్య పుష్కరాలను పురస్కరించుకుని నరసాపురం వలంధర రేవులోని గోదావరి మాతకు పవిత్రమైన గోదావరి జలాలతో శనివారం ధర్మరక్షా వేదిక ఆధ్వర్యంలో అభిషేకాలు చేశారు. గోదావరి మాతతో పాటు పరమేశ్వరుడు, నందీశ్వరుడు, విఘ్నేశ్వరుడు, ఆంజనేయునికి జలాలతో అభిషేకాలు చేశారు. వశిష్ఠ ఘాట్‌కు నీరాజన మంత్ర పుష్పాలతో పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మరక్షా వేదిక జిల్లా అధ్యక్షుడు తోరం సూర్యనారాయణ మాట్లాడుతూ అభిజిత్ నక్షత్ర లఘ్నమందు పుష్కరునితో 33 కోట్ల దేవతలు సమస్త తీర్థాలు బృహస్పతి, పితృ దేవతలు ఈ నక్షత్ర సమయంలో ప్రవేశించగానే హిందూ బంధువులతో పుష్కర స్నానాలు ఆచరించారన్నారు. దేశంలో ఉన్న 12 జీవనదుల్లో ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలు ఒక గోదావరికే వస్తాయన్నారు. గతేడాది ఆది పుష్కరాలు ఏ విధంగానైతే పుణ్యస్నానాలు ఆచరించారో, అంత్య పుష్కరాల్లో కూడా భక్తులందరూ పవిత్ర స్నానాలు ఆచరించాలని కోరారు. హిందూ చైతన్యవేదిక అధ్యక్షుడు రావూరి అనంత్, ఆర్‌ఎస్‌ఎస్ ప్రచార ప్రముఖ్ గరికిముక్కు సుబ్బయ్య, ఆర్. శ్రీచరణ్ తదితరులు పాల్గొన్నారు.
కొవ్వూరులో ఏర్పాట్లు పరిశీలించిన మురళీమోహన్
కొవ్వూరు: నేటి నుండి ప్రారంభం కాబోయే గోదావరి అంత్య పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించాలని రాజమహేంద్రవరం ఎంపి మాగంటి మురళీమోహన్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం స్థానిక గోష్పాద క్షేత్రాన్ని ఎంపి మురళీమోహన్ సందర్శించారు. స్నాన ఘట్టాలు, మత్స్యకారులకు ఏర్పాటుచేసిన పడవలను, గజ ఈతగాళ్లు తదితర రక్షణ చర్యలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ గతేడాది నిర్వహించిన గోదావరి పుష్కరాలను స్ఫూర్తిగా తీసుకుని అంత్య పుష్కరాలను కూడా వైభవంగా నిర్వహించాలన్నారు. అంత్య పుష్కరాలకు ఒడిస్సా, తమిళనాడు తదితర రాష్ట్రాల నుండి విశేష సంఖ్యలో భక్తులు తరలివస్తారన్నారు. అంత్య పుష్కరాల ముగింపు కార్యక్రమాన్ని వైభంగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఎంపి ఆదేశించారు. ఎంపి మురళీమోహన్ వెంట కొవ్వూరు ఎమ్మెల్యే కెఎస్ జవహర్, మున్సిపల్ ఛైర్మన్ సూరపని రామ్మోహన్, ఆర్డీవో శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ టి నాగేంద్రకుమార్, తహసీల్దార్ కె విజయకుమార్, ఫైర్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు, టిడిపి నేతలు జెవిఎస్ చౌదరి, పొట్రు శ్రీనివాసు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.