బ్రెజిల్లో విమానం కూలి 8మంది మృతి
Published Tuesday, 2 August 2016బ్రెజిల్: బ్రెజిల్లో విమానం కూలి మంటలు చెలరేగి అందులోని 8 మంది అక్కడికక్కడే మృతిచెందారు. పైపర్ నవాజో జెట్ విమానం పరానా రాష్ట్రంలోని క్యాంబే ప్రాంతంలో రవాణా శాఖ భవనంపై కూలిపోయింది. జెట్ విమానం లోని ప్రయాణికులంతాఓ పెళ్లికి హాజరై తిరిగి వస్తున్నారని, కొద్దిసేపట్లో గమ్యం చేరుకుంటారనగా ప్రమాదం జరిగిపోయిందని అధికారులు వెల్లడించారు. ప్రమాదం చోటుచేసుకున్న ప్రదేశానికి కొద్ది దూరంలో ఓ చర్చిలో 300 మంది ప్రార్థనలు చేస్తున్నారని, అదృవశాత్తు వారికి ఏమీ కాలేదని స్థానికులు తెలిపారు.