ఎమ్మెల్యే ధూళిపాళ్ల నిరసన దీక్ష
Published Tuesday, 2 August 2016గుంటూరు : పొన్నూరు తెదేపా ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఒక రోజు నిరసన దీక్ష చేపట్టారు. దీక్షకు మద్దతు తెలిపేందుకు తెదేపా శ్రేణులు భారీగా తరలివచ్చారు. పొన్నూరులోని ఆచార్య ఎన్జీరంగా విగ్రహం వద్ద సాయంత్రం 5గంటల వరకు దీక్ష కొనసాగనుంది. ప్రత్యేక హోదాపై కేంద్రం స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని నరేంద్రడిమాండ్ చేశారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవంతో చెలగాటమాడొద్దని హెచ్చరించారు. రాష్ట్రాన్ని కేంద్రమే ఆదుకోవాలని కోరారు.