ఆనందీబెన్ను బలిపశువును చేశారు: రాహుల్
Published Tuesday, 2 August 2016దిల్లీ: గుజరాత్లో తాజాగా ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనందీబెన్ కారకురాలు కాదని, ప్రధాని మోదీ పాలన వల్లే శాంతిభద్రతలు క్షీణించాయని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆనందీబెన్ను బలిపశువును చేసినప్పటికీ ఆమె పదవీ త్యాగం వల్ల గుజరాత్లో బిజెపి బలపడలేదన్నారు. పటేల్ కులస్థుల ఆందోళన, దళితులపై దాడులతో గుజరాత్లో పరిస్థితులు క్షీణించడానికి మోదీయే బాధ్యత వహించాలన్నారు. కాగా, గుజరాత్లో తమ పార్టీ ఎదుగుదలను చూసి ముఖ్యమంత్రిని మార్చాలని బిజెపి నిర్ణయించిందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ సిఎం కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి ఘోర పరాజయం తప్పదన్నారు.