టీడీపీ, వైసీపీ ఎంపీలతో స్పీకర్ చర్చలు విఫలం
Published Tuesday, 2 August 2016దిల్లీ: లోక్సభలో మంగళవారం నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ, వైసీపీ ఎంపీలతో స్పీకర్ సుమిత్రామహాజన్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. స్పీకర్ సభను కొనసాగిస్తుండగా, మరోవైపు టీడీపీ, వైసీపీ ఎంపీలు నిరసనను కొనసాగిస్తున్నారు. నిరసన విరమించాలని స్పీకర్ కోరగా, ప్రత్యేక హోదా ప్రకటించేవరకు తమ నిరసన కొనసాగుతుందని ఎంపీలు స్పష్టం చేశారు.