నకిలీ బంగారం ముఠా అరెస్ట్
Published Tuesday, 2 August 2016కరీంనగర్: నకిలీ బంగారం అమ్ముతున్న ముగ్గురు ముఠా సభ్యులను కరీంనగర్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితుల్లో కర్నూలుకు చెందిన మాజీ కానిస్టేబుల్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ముఠా నుంచి 3 లక్షల నగదు, మూడు బంగారం నాణేలు, 10 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.