మళ్లీ ఫ్యాక్షన్ గొడవలు: ఆరుగురికి తీవ్రగాయాలు
Published Tuesday, 2 August 2016అనంతపురం: ఉరవకొండ మండలం పెద్దమొస్తూరులో ఫ్యాక్షన్ గొడవలతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ దాడిలోఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి.. మరోముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పొలంలో పిల్లలు వేరుశనగ మొక్కలు తొక్కారని ఈ ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఇరువర్గీయులను చెదరగొట్టి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.