ఆటో, ఆయిల్ ట్యాంకర్ ఢీ: ఒకరి మృతి
Published Tuesday, 2 August 2016గుంటూరు : బొల్లాపల్లి మండలం మేళ్లవాగు వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్ ఢీకొని వద్దాలపు నాగరాజు అనే యువకుడు మృతిచెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆయిల్ ట్యాంకర్ కూచనపల్లి వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కారంపూడిలోని ఆస్పత్రికి తరలించారు.