గొంతు కోసి హత్యాయత్నం!
Published Tuesday, 2 August 2016విజయవాడ : అనంతపురం పట్టణానికి చెందిన ఓ వ్యక్తిపై గన్నవరం విమానాశ్రయం వద్ద మంగళవారం హత్యాయత్నం జరిగింది. ఎవరో ఉద్దేశపూర్వకంగానే అతడి గొంతు కోసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతపురం నుంచి నెల్లూరు వెళ్లేందుకు బాధితుడు అశోక్ లారీ ఎక్కాడని, గన్నవరం వరకు తీసుకొచ్చి గొంతు కోసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది.