కల నిజమైంది!
Published Tuesday, 2 August 2016ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్వాంటెడ్ హీరోయిన్గా క్రేజ్ తెచ్చుకుంది అందాల భామ రకుల్ప్రీత్సింగ్. వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ భామకు మహేష్బాబు సరసన నటించే ఛాన్స్ దక్కిన విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రతిష్ఠాత్మక చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. ఈ చిత్రంలో మహేష్ సరసన హీరోయిన్గా పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించినప్పటికీ, చివరగా రకుల్ను ఓకే చేశారు. ప్రస్తుతం ఈమె రామ్చరణ్ సరసన ‘ధ్రువ’ చిత్రంలో నటిస్తోంది. మహేష్ సినిమాలో ఛాన్స్ దక్కడంతో ఎగిరి గంతేశానని, ఎప్పటినుంచో ఆయన సినిమాలో హీరోయిన్గా చేయాలన్న కోరిక ఇప్పుడే తీరిందని చెప్పింది. నిజానికి పరిణీతి చోప్రాను తీసుకుంటారని వార్తలు రావడంతో కాస్త నెర్వస్గా ఫీలయ్యానని, కానీ చివరగా ననే్న ఎంపిక చేయడంతో షాక్ అయ్యానని చెప్పింది. మొత్తానికి ఈ సినిమాతో తన రెండు కోరికలు తీరయాని చెబుతోంది. ఆ రెండో కోరిక ఏంటంటే, మురగదాస్ సినిమాలో కూడా నటించాలని కోరిక వుండేదట. మొత్తానికి ఒకే దెబ్బకు రెండు పిట్టలంటే ఇదేనేమో!