వౌలిక సదుపాయాలు కల్పించాలి
Published Tuesday, 2 August 2016కల్వకుర్తి, ఆగస్టు 2: విద్యార్థులకు వౌళిక సదుపాయాలు కల్పించాలని కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎంపిడిఓ కార్యాలయం సమావేశ మందిరంలో నియోజకవర్గ ప్రధానోపాద్యాయుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే చల్లా వంశీచంద్రెడ్డి ముఖ్య అతిథిగా హజరయ్యారు. సమావేశంలో నియోజకవర్గంలోని పాఠశాలలో ఉన్న సమస్యలపై సమీక్ష చేశారు. అలాగే నియోజకవర్గ మండలాల విద్యాధికారులు,పలు పాఠశాల ప్రధానోపాద్యాయులు తమతమ పాఠశాలల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు ప్రణాళికతో నియోజకవర్గంలోని పాఠశాలలో సమస్యలను పరిష్కరించేందుకు అందరు కృషి చేయాలని మండల విధ్యాధికారులకు, ప్రధానోపాద్యాయులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ సమావేశంలో షాద్నగర్ డిప్యూటి డిఇఓ, ప్రధానోపాద్యాయులు, తదితరులు పాల్గొన్నారు.