బైపాస్లో ప్రమాదం : విద్యార్థి మృతి
Published Tuesday, 2 August 2016కోదాడ, ఆగస్టు 2: 65వ, నెంబరు జాతీయరహదారి కోదాడ బైపాస్పై కట్టకొమ్ముగూడెం క్రాస్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలకు గురయ్యారు. కోదాడ మండలం గోల్తండకు చెందిన బాణోతు ప్రసాద్, శ్రీహరిలు పట్టణంలోని వేర్వేరు కాలేజీల్లో చదువుతున్నారు. సోమవారం బోణాలు పండగ సెలవు సందర్భంగా ఇంటికి వెళ్లిన కొడుకులను మంగళవారం కాలేజీల వద్ద దింపేందుకు తండ్రి శ్రీను కొడుకులతో బైక్పై బయలుదేరి చిన్నకుమారుడు శ్రీహరిని శ్రీమేధ కాలేజీలో దింపి పెద్దకొడుకు ప్రసాద్ను సుగుణ కాలేజీవద్ద దింపేందుకు జాతీయరహదారిని దాటుతుండగా హైద్రాబాద్నుండి విజయవాడ వెళుతున్న కారు ఢీకొన్నది. ప్రసాద్, శ్రీను ఇద్దరు తీవ్ర గాయాలకు గురయ్యారు. ప్రసాద్ను చికిత్స నిమిత్తం ఖమ్మంకు తరలిస్తుండగా మార్గమద్యలో మృతి చెందాడు. తీవ్రగాయాలతో శ్రీను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతుండగా కోదాడ పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.