బునాదిగాని కాల్వ అక్రమ త వ్వకాన్ని అడ్డుకున్న రైతులు
Published Tuesday, 2 August 2016ఆత్మకూర్(ఎం), ఆగస్టు 2: మండల కేంద్రంలోని సబ్స్టేషన్ ఆవరణలో కల్వర్టు బునాదిగాని కాల్వ పనులు చేస్తుండగా నిర్మల అనే మహిళా రైతు అక్రమంగా మద్యలో పోతున్న కాల్వను బంద్ చేయించి గెట్టు పునాదును తవ్వుతున్నందున 292 సర్వే నెంబర్లో రైతులు గడ్డం సత్యనారాయణ, గడ్డం స్వామిలు మంగళవారం అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. నా భూమిలో నా ఇష్టం వచ్చినట్లు తీసుకుంటా.. పనులు చేయించుకుంటా.. నాకు అన్ని ఆధారాలు ఉన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చట్ట ప్రకారం బునాదిగాని కాల్వ సర్వే ప్రకారం రూల్స్ పాటించాల్సింది పోయి స్వంత భూమిలో ఎట్ల సైడ్ తీసుకుంటారని జేసిబిని బంద్ చేయించారు. నిర్మల అనే రైతు అధికారుల పరంగా కాల్వ తీసుకునేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని విలేఖరులకు తెలిపారు.