అంత్య పుష్కరాలపై అమావాస్య ప్రభావం
Published Wednesday, 3 August 2016మంగపేట, ఆగస్టు 2 :మంగపేట గోదావరి ఫెర్రీ పాయింట్ వద్ద నిర్మించిన పుష్కరఘాట్కు మంగళవారం భక్తులు తక్కువ సంఖ్యలో విచ్చేశారు. మంగళవారం, అమావాస్య కావడంతో పుష్కర స్నానాలకు, పిండప్రదాన కార్యక్రమానికి మంగళవారం భక్తజనం స్వల్ప సంఖ్యలో హాజరయ్యారు. వచ్చిన కాస్తా భక్తులు కూడా పుష్కరఘాట్ అధికారులు తగిన ఏర్పాట్లు చేయకపోవడంపై పెదవి విరుస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పుష్కరఘాట్ వద్ద తగిన ఏర్పాట్లను చేయాలని ప్రజలు, భక్తులు కోరుతున్నారు.