144 సెక్షన్ ఎత్తివేయాలి
Published Wednesday, 3 August 2016జనగామ టౌన్, ఆగస్టు 2: జనగామలో అమలు చేస్తున్న 144సెక్షన్ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, పిసిసి మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య మంగళవారం హైదరాబాద్లో గవర్నర్ నరసింహన్ను కలిసి వినతిపత్రం అందచేసినట్లు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధికార ప్రతినిధి రంగరాజు ప్రవీణ్కుమార్ తెలిపారు. గత 45రోజులుగా జనగామ పట్టణంతో పాటు చుట్టుపక్కల మండలాల్లోని పలు గ్రామాల్లో 144సెక్షన్ను అమలులో ఉన్నందున స్థానిక ప్రజలు పొన్నాల లక్ష్మయ్య దృష్టికి తీసుకెళ్లారని ప్రవీణ్కుమార్ తెలిపారు. అందుకే ఉత్తమ్కుమార్రెడ్డి, భట్టి విక్రమార్కలతో పొన్నాల లక్ష్మయ్య చర్చించి గవర్నర్కు వినతిపత్రం అందచేశారని వివరించారు. అలాగే బలవంతంగా రైతుల నుంచి భూములు సేకరించవద్దని, ఎంసెట్ లీకేజీకి కారణమైన అధికారులు, నాయకులపై చర్యలు తీసుకోవాలని వారు గవర్నర్ను కోరినట్లు ప్రవీణ్ పేర్కొన్నారు.