టిడిపితో పొత్తే కొంప ముంచింది
Published Wednesday, 3 August 2016శంషాబాద్, ఆగస్టు 2: అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ - టిఆర్ఎస్ పార్టీలకు భవిష్యత్ లేదని బిజెపి శాసనపక్షం నాయకుడు కిషన్రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని బహదూర్గూడ సమీపంలో పద్మావతి ఫంక్షన్ హాల్లో రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలకు భవిష్యత్ లేదని ఘాటు విమర్శలు చేశారు. భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడకి వెళ్ళినా మంచి ఆదరణ లభిస్తున్నది. మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజలు బిజెపికి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. తెలంగాణలో టిడిపితో పొత్తే బిజెపి కొంపు ముంచిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 7న తెలంగాణకు మొదటిసారిగా వస్తున్నందున నగరంలో ఎల్.బి.స్టేడియంలో బిజెపి పార్ట ఆధ్వర్యంలో బహిరంగ సభ ఉంది, కాబట్టి జనసమీకరణ కోసమే. సమవాశం పెట్టడం జరిగిందన్నారు. తెలంగాణాలో ఇతర పార్టీలకు భవిష్యత్ లేదు కాబట్టి కాంగ్రెస్, టిడిపి పార్టీ నాయకులతో పాటు హాస్టల్ విద్యార్థులు, ఇంనీరింగ్ విద్యార్థులు ప్రజా సంఘాలు, డ్వాక్రా సంఘం మహిళలు, ప్రతి ఒక్కరిని రప్పించి సభను విజయవంతం చేయాలని నాయకులకు సలహాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహ్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ, బిజెపి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల పార్టీ అధ్యక్షుడు వెంకటయ్య, నాయకులు ప్రేమ్రాజ్, ఆంజనేయులు, ధన్రాజ్, చంద్రయ్య, పెంటయ్య, శ్రీ్ధర్, వివిధ మండల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. అనంతరం బిజెపి పక్ష నేత కిషన్రెడ్డికి శంషాబాద్ బిజెపి నాయకులు ఘనంగా సన్మానించారు.