రెండవ రోజూ పనిచేయని పట్టిసం మోటార్లు
Published Wednesday, 3 August 2016పోలవరం, ఆగస్టు 2: పట్టిసం ఎత్తిపోతల పథకంలోని మోటార్లు రెండవ రోజు కూడా ఆన్ చేయలేదు. కృష్ణా జిల్లాలోని రాచూరు వద్ద ప్రాజెక్టు కుడి కాలువ అక్విడెక్టు దిగువ భాగంలో గండి పడడంతో గోదావరి నీటిని కృష్ణాకు తరలింపు కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేశారు. గండిపడక ముందు 12 మోటార్లు ద్వారా 4,250 క్యూసెక్కుల నీటిని కృష్ణాకు తరలించేవారు. గండిని ఒక్క రోజులోనే పూడ్చివేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించినా ఆ పనులు ఇంకా పూర్తికాలేదు. దీంతో మోటార్లను ఆన్ చేయడం లేదు. గండి పూడ్చిన వెంటనే తిరిగి మోటార్లను ఉపయోగిస్తామని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు.