చిన వెంకన్న ఆలయంపై బంద్, అమావాస్య ప్రభావం
Published Wednesday, 3 August 2016ద్వారకాతిరుమల, ఆగస్టు 2: అమావాస్య తిథితోపాటు బంద్ ప్రభావం చిన వెంకన్న క్షేత్రంపై చూపింది. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఆలయం మంగళవారం నిర్మానుష్యంగా మారింది. కేవలం స్వల్ప సంఖ్యలోనే భక్తులు శ్రీవారిని దర్శించారు. దీంతో ఆలయ పరిసరాలు, ప్రసాదాల టికెట్ కౌంటర్లు, కేశ ఖండన శాల విభాగాలు దాదాపు నిర్మానుష్యమయ్యాయి. శ్రావణ మాసం కావడంతో బుధవారం నుండి రద్దీ పెరగవచ్చునని ఆలయ వర్గాలు భావిస్తున్నాయి.