సిఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన
Published Wednesday, 3 August 2016ధర్మవరం రూరల్, ఆగస్టు 2: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధర్మవరం పర్యటన ఏర్పాట్లను డిఐజి ప్రభాకర్రావు మంగళవారం పరిశీలించారు. హెలీప్యాడ్, పోతుకుంట వద్ద ఫారంపాండు ప్రదేశాన్ని పరిశీలించారు. అలాగే కళాశాల సర్కిల్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించే ఫ్లై ఓవర్ ప్రారంభ స్థలాన్ని, పోలీస్స్టేషన్ పరిసరాల్లో మొక్కలు నాటే పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డిఎస్పి వేణుగోపాల్, సిఐ హరినాథ్, మురళికి పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి వచ్చే సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే బారికేడ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణతో కలిసి బహిరంగ సభాస్థలిని పరిశీలించారు. తొలుత స్టాల్స్ ఏర్పాటు చేసే ప్రదేశాన్ని ఎమ్మెల్యేతో కలిసి పరిశీలించిన ఆయన అభివృద్ధి పనుల శిలాఫలకాల ఏర్పాటు ప్రదేశాన్ని పరిశీలించారు. ముఖ్యమంత్రి బహిరంగ సభ వేదిక వద్దకు వెళ్లే రహదారి, బయటకు వెళ్ళే రహదారులను పరిశీలించారు. ఆయన వెంట ఆర్డిఓ బాలానాయక్, జెడ్పిసిఈఓ రామచంద్ర, మున్సిపల్ చైర్మన్ బీరే గోపాలకృష్ణ, కమీషనర్ నాగమోహన్, మార్కెట్యార్డు చైర్మన్ కమతం కాటమయ్య ఉన్నారు.
బుక్కరాయసముద్రంలో...
బుక్కరాయసముద్రం : బుక్కరాయసముద్రం మండలంలో ఈనెల 6న ముఖ్యమమంత్రి నారాచంద్రబాబునాయుడు పర్యటనలో సందర్భంగాకస్తూరిబాగాంధీ పాఠశాల సమీపంలో ఏర్పాటుచేస్తున్న సభావేదికను కలెక్టర్ కోనశశిధర్, సంయుక్త కలెక్టర్ ఖజామోహిద్దీన్ మంగళవారం పరీశీలించారు. వారివెంట వివిధ శాఖల అధికారులు, అర్డిఓ మలోల ఉన్నారు.