పెద్దమల్లెలలో నంది విగ్రహం చోరీ
Published Wednesday, 3 August 2016రొంపిచెర్ల, ఆగస్టు 2: మండలంలోని పెద్దమల్లెల గ్రామంలో బెస్తపల్లె సమీపంలో వెలసిన ఈశ్వరాలయంలో పురాతనమైన నంది విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్ళారు. గ్రామస్థులు సోమవారం ఆలయానికి వెళ్ళి చూడగా విగ్రహం చోరీకి గురైనట్లు కనుగొన్నారు. ఈవిగ్రహం సుమారు 90 ఏళ్ళు కాలంనాటి పురాతన విగ్రహమని గ్రామస్థులు తెలిపారు. చాలా బరువైన ఈవిగ్రహాన్ని ఎత్తుకెళ్ళడం కష్టమని ఏదైనా వాహనంలో తరలించి ఉంటారని గ్రామస్థులు పేర్కొన్నారు. విగ్రహం చోరీకి గురికావడం పట్ల చుట్టుపక్కల గ్రామస్థులు వచ్చి చూసి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.