జాతీయ పతాక రూపకర్త పింగళికి నివాళి
Published Wednesday, 3 August 2016కాకుమాను, ఆగస్టు 2: దేశం నాకేం ఇచ్చింది కాకుండా, దేశానికి నేనేమిచ్చాను అని అనుకున్నప్పుడే దేశాభివృద్ధి జరుగుతుందన్న గొప్ప వ్యక్తి, స్వాతంత్య్ర సమరయోధుడు, వ్యవసాయ శాస్తవ్రేత్త, మువ్వనె్నల పతాక రూపకర్త పింగళి వెంకయ్య 140వ జయంతి కార్యక్రమం మంగళవారం మండల పరిధిలోని అన్ని పాఠశాలల్లో నిర్వహించారు. కొమ్మూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని చిన్నారులు జాతీయ పతాకాలు చేతపట్టి ఆయన సేవలను కొనియాడారు. పాఠశాల హెచ్ఎం గేరా మోహనరావు ఆ మహానేత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రత్నాకరం, కిషోర్బాబు, చిన్నారులు పాల్గొన్నారు.