జోరువానలో వారోత్సవాలు
Published Wednesday, 3 August 2016సీలేరు, ఆగస్టు 2: ఆంధ్రా - ఒడిషా సరిహద్దుల్లో జోరున వానలు కురుస్తున్నప్పటికీ పి. ఎల్.జి. ఎ. వారోత్సవాలు మావోయిస్టులు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఆంధ్రా - ఒడిషా, మల్కన్గిరి, ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో అమరులైన మావోయిస్టులకు విప్లవ జోహార్లు అర్పించారు. ఈకార్యక్రమాలకు భారీ ఎత్తున గిరిజనులు హాజరయ్యారు. ఒక పక్క వర్షం , మరో పక్క మావోలు వారోత్సవాలు నిర్వహిస్తుండడంతో పోలీసులను కలవరపాటుకు గురి చేస్తుంది. మావోయిస్టులు నుంచి ముప్పు పొంచి ఉందని ఇంటిలిజెన్స్ వర్గాలు సమాచారంతో పోలీసులకు పెనుసవాల్గా మారింది. రేపటితో వారోత్సవాలు ముగియనుండడంతో మావోలు ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడతారోనని సరిహద్దు గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.