మేము లేనప్పుడు ప్రకటిస్తారా?
Published Wednesday, 3 August 2016న్యూఢిల్లీ,ఆగస్టు 2: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించేందుకు లోక్సభలో తమ ఉద్యమం కొనసాగుతుందని వైఎస్ఆర్సిపి నాయకుడు సుబ్బారెడ్డి ప్రకటించారు. లోక్సభలో తాము లేనప్పుడు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్జేట్లి ఏపికి ప్రత్యేక సహాయం గురించి ప్రకటించటం మ్యాచ్ ఫిక్సింగ్లో భాగమేనని ఆయన మంగళవారం విలేఖరులతో అన్నారు. మామూలుగా అయితే మధ్యాహ్నం తరువాత సభలో గొడవ చేయడం లేదని, అందుకే తాము ఇళ్లకు వెళ్లిపోయామన్నారు. అయితే, తాము లేని సమయంలో జైట్లీ ఈ ప్రకటన చేయటం వెనుక ఉన్న అర్థమేమిటని సుబ్బారెడ్డి ప్రశ్నించారు. తమ పార్టీ సభ్యులు బుధవారం లోక్సభ పోడియం వద్దకు వెళ్లి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తారని ఆయన స్పష్టం చేశారు. లోక్సభలో జైట్లీ ప్రకటన చేస్తారనే విషయం తెలుగుదేశం సభ్యులకు ఎవరు చెప్పారని ఆయన నిలదీశారు. బిజెపి, తెలుగుదేశం కలిసి ఈ నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. ఏపికి ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం సభ్యులు బుధవారం లోక్సభలో ఉద్యమిస్తారా? లేదా? అనేది తమకు అనవసరమన్నారు. తమ ఉద్యమం మాత్రం కొనసాగుతుందని సుబ్బారెడ్డి తెలిపారు.