వంతెన కూలి పలు వాహనాలు గల్లంతు
Published Wednesday, 3 August 2016ముంబయి: భారీ వర్షాల కారణంగా మహారాష్టల్రో ముంబయి-గోవా రహదారిలో సావిత్రి నదిపై వంతనె కూలిపోగా రెండు బస్సులు, 8 వాహనాలు కొట్టుకుపోయాయి. ఆ బస్సుల్లో 22 మంది ప్రయాణీకులున్నట్టు సమాచారం. గల్లంతైన వాహనాల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. 50 మంది ఎన్డిఆర్ఎఫ్ సిబ్బందితో పాటు హెలికాప్టర్ ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లా అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.