లోక్సభలో ఎపి ఎంపీల ఆందోళన
Published Wednesday, 3 August 2016దిల్లీ: లోక్సభ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభం కాగానే ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎంపీలు మళ్లీ ఆందోళన ప్రారంభించారు. ఎపికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు ప్రారంభించారు. సభా కార్యక్రమాలకు అడ్డుతగలరాదని స్పీకర్ సుమిత్రా మహాజన్ చేసిన విజ్ఞప్తిని వారు పట్టించుకోలేదు. ప్రత్యేక హోదా విషయమై ఇప్పటికే ఎపీకి చెందిన కేంద్రమంత్రులతో ఆర్థికమంత్రి జైట్లీ మాట్లాడారని, రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడా చర్చలు జరుగుతున్నాయని గనుక ఆందోళన విరమించాలని స్పీకర్ సూచించారు. ఎంపీల నిరసన మధ్య ఆమె ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు.