వాహనాల మధ్య ఇరుక్కున్న బైక్: ఇద్దరు మృతి
Published Wednesday, 3 August 2016రాజమండ్రి: నగరంలోని ఆల్మట్తోట వద్ద బుధవారం ఉదయం ఎదురెదురుగా వస్తున్న ఆటో, వ్యాన్ ఢీకొనగా మధ్యలో ఓ బైక్ ఇరుక్కుపోయి ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. రెండు వాహనాలను ఓవర్టేక్ చేయడానికి బైక్పై ప్రయాణిస్తున్న వారు ప్రయత్నించి కింద పడ్డారు. ఆటో, వ్యాన్ మధ్య వారు నలిగిపోయి ప్రాణాలు కోల్పోయారు.