బెజవాడలో రోడ్లు ఊడ్చిన కాంగ్రెస్ నేతలు
Published Wednesday, 3 August 2016విజయవాడ: ఎపికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ విజయవాడలో బుధవారం ఉదయం కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు చీపుర్లను చేతపట్టుకుని రోడ్లను ఊడ్చారు. హోదా విషయంలో బిజెపి, టిడిపి నేతలు నాటకాలాడుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగించినందుకు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.