గ్రూప్-2 సర్వీసులకు స్క్రీనింగ్ పరీక్ష
Published Thursday, 4 August 2016హైదరాబాద్, ఆగస్టు 3: ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ -2 సర్వీసులకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించాలన్న పబ్లిక్ సర్వీసు కమిషన్ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించింది. 150 మార్కులకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు. అందుకు సంబంధించి సిలబస్ను సైతం ప్రభుత్వం ఆమోదించింది. గ్రూప్-2 అభ్యర్ధులకు ఆన్లైన్లోనే మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. మెయిన్ పరీక్షలో పేపర్-1 జనరల్ స్టడీస్ 150 మార్కులకు, పేపర్-2 మొత్తం 150 మార్కులకు, పేపర్ -3 భారత్ ఆర్ధిక అంశాలపై 150 మార్కులకు ఉంటుంది.