నగరానికి చేరిన ఎస్పిజి బృందం
Published Thursday, 4 August 2016హైదరాబాద్: ప్రధాని మోదీ ఈనెల 7న ఒకరోజు పర్యటనకు వస్తున్నందున పలుచోట్ల భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు ఎస్పిజి (ప్రత్యేక భద్రతా దళం) అధికారులు గురువారం నగరానికి చేరుకున్నారు. గజ్వేల్, రామగుండం, హైదరాబాద్లో ప్రధాని పర్యటన ఉన్నందున ఈ ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. మోదీ బహిరంగ సభ జరిగే ఎల్బి స్టేడియంను ఎస్పిజి అధికారులు పరిశీలించారు. తెలంగాణ పోలీసు శాఖ ఉన్నతాధికారులు, బిజెపి ముఖ్యనేతలతో ఎస్పిజి అధికారులు సమావేశమయ్యారు.